Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిపై తీర్పు రిజర్వు

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:03 IST)
స్వ‌తంత్రుల‌కే ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారాలు ఇవ్వాల‌ని, హైకోర్టులో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ పూర్తైంది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ,  దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 
 
నీలం సాహ్నిని ఎస్​ఈసీ గా నియమించడాన్నిసవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు గ‌తంలో తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. 
 
ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున నీలం సాహ్ని స్వతంత్ర ఎస్​ఈసీ కాదని, పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.




సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments