Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి సీఈసీ క్లాస్.. దొంగ ఓట్ల గోలేంటి?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు క్లాస్ పీకారు. ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీకి పిలిపించి మరీ మందలించారు. ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులతో ఇంటంటి తనిఖీలు చేపట్టాలని, ఆ సమయంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ తనిఖీల్లో పాలు పంచుకునేలా చూడాలని ఆదేశించారు. 
 
ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చి కలవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆయన మంగళవారం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి... ఈసీఐ డిప్యూటీ కమిషనర్ 3 గంటలపాటు సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కార్యక్రమం సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని తెలిపారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments