Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి సీఈసీ క్లాస్.. దొంగ ఓట్ల గోలేంటి?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు క్లాస్ పీకారు. ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీకి పిలిపించి మరీ మందలించారు. ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులతో ఇంటంటి తనిఖీలు చేపట్టాలని, ఆ సమయంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ తనిఖీల్లో పాలు పంచుకునేలా చూడాలని ఆదేశించారు. 
 
ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చి కలవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆయన మంగళవారం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి... ఈసీఐ డిప్యూటీ కమిషనర్ 3 గంటలపాటు సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కార్యక్రమం సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని తెలిపారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments