Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్టీ విద్యార్థిని కిడ్నాప్ చేసి చంపేశారు.. ఏలూరులో దారుణం!

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దళిత విద్యార్థి హత్యకు గురయ్యాడు. హాస్టల్‌లో ఉంటూ చదవుకుంటూ వచ్చిన ఈ బాలుడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి అతి క్రూరంగా చంపేశారు. అర్థరాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి హాస్టల్‌లోకి చొరబడిన దుండగులు ఆ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి పాఠశాల ఆవరణలో పడేశారు. బతకాలని అనుకున్నవారు వెళ్లాపోవాలని, లేదంటే ఇలాంటి సీన్లు రిపీట్ అవుతాయంటూ దండగులు ఓ లేఖ రాశారు. 
 
ఏలూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో జరిగిన అత్యంత దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. మన్యంలోని కుగ్రామమైన ఉర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డి వలంటీరు. ఆయన భార్య రామలక్ష్మి ఆశా కార్యకర్త. వీరి ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఆరో తరగతి, చిన్నవాడైన అఖిలవర్థన్ రెడ్డి (9) నాలుగో తరగతి చదువుతున్నారు.
 
సోమవారం అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విద్యుత్ సరఫరా నిలిపివేసి అఖిలవర్ధన్ రెడ్డిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం హత్య చేసి సమీపంలోని గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. 'బతకాలనుకున్నవారు వెళ్లిపోండి. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతుంటాయి.. ఇట్లు.. ' అని రాసి వున్న లేఖను బాలుడి చేతిలో పెట్టి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు పాఠశాల హెడ్మాస్టర్, వార్డెన్, వాచ్‌మెన్‌లను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments