Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది..

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది ఓ ఉద్యోగిని. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (17:44 IST)
తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది ఓ ఉద్యోగిని. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మాదాపూర్ మిలాంజ్ టవర్‌ తొమ్మిదో అంతస్తులోని ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రావణి గురువారం కార్యాలయానికి వచ్చింది. 
 
కానీ కాసేపటికే.. బాల్కనీ వద్దకు వచ్చి ఓ స్టూల్‌ను తీసుకొని అక్కడి నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడింది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండటంతో మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ కేసు నమోదు చేసుకుని శ్రావణి ఆత్మహత్యపై పలుకోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా చిత్తూరు జిల్లాకు చెందిన శ్రావణి... భర్త రామకృష్ణారెడ్డితో కలిసి మియాపూర్‌లోని మదీనాగూడలో నివాసం ఉంటుంది. శ్రావణికి ఒక బాబు కూడా ఉన్నాడు. గృహిణి అయిన శ్రావణికి వేరైమైనా సమస్యలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments