Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయి పుడుతుందనుకుంటే.. అబ్బాయి పుట్టాడు.. అంతే చంపేసింది..?

ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని

అమ్మాయి పుడుతుందనుకుంటే.. అబ్బాయి పుట్టాడు.. అంతే చంపేసింది..?
, మంగళవారం, 26 జూన్ 2018 (09:36 IST)
ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి నిజాలేంటో నిగ్గు తేల్చారు.
 
వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ తహసీల్ పరిధిలోని పైఠణ్‌ ఖేడ్ గ్రామంలో దేవిక ఇరాండే అనే మహిళకు ఓ కుమారుడు ఉండగా, మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి తనకు కుమార్తె పుడుతుందని ఆమె అనుకుంది. కానీ కుమారుడే పుట్టడంతో నిరాశ చెందింది. బాలుడికి ప్రేమ్ పరమేశ్వర్ ఇరాండే అని పేరు పెట్టిన దేవిక, ఆమె భర్త, బిడ్డను పది నెలల పాటు పెంచారు.
 
ఇంతలో తన కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాగిలాల సాయంతో దేవిక ఇంటి వద్ద డ్రమ్ములోనే పిల్లాడి మృతదేహాన్ని కనుగొన్నారు. చివరకు కన్నబిడ్డను తల్లే చంపేసిందని విచారణలో వెల్లడి అయ్యింది. దీంతో దేవికను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగమ్మాయిని ఓడించేందుకు రూ.65 కోట్లు ఖర్చు.. ఎక్కడ?