Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:48 IST)
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మినీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరో 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జిల్లాలోని నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన పలువురు మినీ బస్సులో తిరుమలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ మినీ బస్సులో 32 మంది కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు, వారి బంధువులుగా ఉన్నారు. 
 
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో చలపతి (45), బాదమ్మ (40) అనే దంపతులతో పాటు.. వీరి మేనల్లుడు ఈశ్వరయ్య (22)లు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments