Webdunia - Bharat's app for daily news and videos

Install App

పయ్యావుల కేశవ్ తప్పుడు లెక్కలు చెబుతున్నరు.. విత్తమంత్రి బుగ్గన

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖలో లెక్కలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలున్నాయని స్పష్టం చేశారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమన్నారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారు. సీఎఫ్‌ఎంను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే అని తెలిపారు. ఆడిట్‌ సంస్థ ప్రశ్నల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏమైనా సందేహాలుంటే మీటింగ్ పెట్టి క్లారిటీ తీసుకోవచ్చు అంటూ మంత్రి బుగ్గన సలహా ఇచ్చారు.
 
కాగా, రాష్ట్ర ఆర్థికశాఖ అస్తవ్యస్థ విధానాలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఖజానా నుంచి రూ.41,043 కోట్లకు సంబంధించి ఖర్చుల వివరాలు లేవంటూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments