Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామచంద్రాపురంలో బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వినూత్న కార్యక్రమం

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:01 IST)
వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌కీయ నాయ‌కులు త‌మ స్ట‌యిల్ ని మార్చుకుంటున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వినూత్నకార్యక్రమానికి  మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శ్రీకారం చుట్టారు. 
 
ఉద‌యాన్నే తాను పిలిచిన వారితో ఒక పెద్ద రౌండ‌ప్ గా కుర్చీలు వేసి, బ్రేక్ ఫాస్ట్ చేస్తూ, స‌మ‌స్య‌ల‌పై అంద‌రితో చ‌ర్చిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌పై స‌మ‌న్వ‌యం చేసి ప‌రిష్కార మార్గాల‌ను సూచిస్తున్నారు. మొదటి రోజు రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్‌లతో మంత్రి చెల్లుబోయిన‌ సమావేశమై, మున్సిపల్ పరిధిలోని సమస్యల‌పై చర్చించారు. 
 
పారిశుధ్యంపై వార్డు కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ద చూపించాలని మంత్రి సూచించారు. స్వచ్చ, స్వేచ్చా రామచంద్రాపురం దిశగా నియోజకవర్గం ఉండాలని ఈ సమావేశంలో కౌన్సిలర్లతో త‌న ఆశభావం వ్యక్తం చేశారు మంత్రి. ఇలాగే నిత్యం వివిధ వ‌ర్గాల వారితో, అధికారుల‌తో  బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వినూత్న కార్యక్రమం ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లంద‌రితో మ‌మేకం కావాల‌ని మంత్రి ప్లాన్ చేశారు. ఉద‌యాన్నే మంత్రి గారిని క‌ల‌వ‌డం, అదీ ఆయ‌న‌తో బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం బాగుంద‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments