యువతిని గట్టిగా పట్టుకుని కళ్లలో యాసిడ్ పోశారు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:58 IST)
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో దారుణం జరిగింది. యువతిని గట్టిగా పట్టుకుని ఆమె కళ్లలో యాసిడ్ పోశారు దుండగలు. తమకు పరిచయమైన ఓ యువతిని తమకు దక్కకుండా తప్పించిందనే అనుమానంతో సదరు యువతిని దుర్మార్గులు ఆమెను ఇంటి నుండి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె కళ్లలో యాసిడ్‌ పోసి రుద్దారు.
 
దీనితో బాధితురాలు అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితులు ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. యువతిని సమీప ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుండి రేవా మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బాధితురాలు తన సోదరుడితో కలిసి ఆమె ఇంట్లో ఉంటోంది. పొరుగున నివశించే నిందితుడు సుమ్మి రాజా, గోల్డీ రాజా వచ్చి, తాము కొంత ప్రశ్నించాల్సి ఉందని చెప్పి వారిద్దరినీ బలవంతంగా తీసుకెళ్లారు. వారిద్దరనీ భౌతికంగా వేధించిన తర్వాత, వారిని దారుణంగా కొట్టారు. యువతి కళ్లలో యాసిడ్ పోశారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments