Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తినిపించి ప్రేమలో పడేశాడు.. వాడుకుని వదిలేశాడు...

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (13:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ రకాలుగా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు భరోసా ఇచ్చేందుకు వీలుగా స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాధితులు వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 
 
తాజాగా ఓ యువతి ప్రేమికుడు చేతిలో మోసపోయింది. ఈ విషయాన్ని స్పందన కార్యక్రమంలో బహిర్గతం చేసింది. తన తోపుడు బండి పక్కనే మరో బండిపై చికెన్ పకోడీ అమ్ముకునే యువకుడు, నిత్యమూ తనకు చికెన్ పెట్టి, ఆపై ప్రేమిస్తున్నానని చెబితే, నమ్మి మోసపోయానని వాపోయింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన ఓ యువతి 7వ తరగతి వరకూ చదువుకుంది. ఆమె తండ్రి వికలాంగుడు. కుటుంబ పోషణార్థం, ఆడవారి అలంకరణ వస్తువులను తోపుడు బండిపై పెట్టుకుని అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె బండి పక్కనే అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మరో తోపుడు బండిపై చికెన్ పకోడీ వ్యాపారం చేస్తున్నాడు. పక్కనే ఉంటూ స్నేహంగా మెలగడంతో, ఆమె కూడా తరచూ మాట్లాడేది.
 
ఈ క్రమంలో నిత్యమూ పకోడీలు పెట్టిన అతను, ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లాడతానని మభ్య పెట్టాడు. నువ్వు లేకపోతే చనిపోతానంటూ నమ్మించాడు. దీంతో ఆ యువతి కూడా ప్రేమలో పడిపోయింది. ఆమెను పెదకాకానికి తీసుకెళ్లిన అతను, గుడిలో తాళి కట్టి, పెళ్లయి పోయిందంటూ, ఓ గది తీసుకుని కాపురం పెట్టాడు.
 
ఆపై తనకు అప్పులున్నాయంటూ, బాధితురాలి వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను తీసుకెళ్లాడు. రెండు నెలల కాపురం తర్వాత యువతి గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న అతను ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్తను, అతని తల్లే దాచి పెట్టిందని, ఇప్పుడు మరో పెళ్లి చేయాలని చూస్తోందని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. దీనిపై స్పందించిన అధికారులు, విచారణ జరిపించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం