Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు.. నాపై దాడి చేస్తారని తెలిసి..? అఖిలప్రియ

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (21:45 IST)
తనపై దాడికి ప్రయత్నించారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ తెలిపారు. భిన్నమైన ఆళ్లగడ్డ రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దాడి చేసేందుకు కాపుకాశారని.. నాపై దాడి చేస్తారని తెలిసి ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీంతో, వెంటనే పోలీసులు స్పందించి వారిని చెదరగొట్టారని వెల్లడించారు భూమా అఖిలప్రియ.
 
ఏ ఎన్నికలైనా అరాచకాలతో గెలవాలనుకుంటే కుదరని కామెంట్ చేసిన అఖిల ప్రియ... దయచేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయవద్దని హితవుపలికారు. కాగా, ఇప్పటికే ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 
 
మరోవైపు.. పాలక, ప్రతిపక్షాలతో పాటు.. ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య చోటుచేసుకున్న పరిణామాలు చర్చగా మారుతున్నాయి. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై బెయిల్‌ పైన విడుదల టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. 
 
భూ వివాదం నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన సునీల్ రావు, అనీల్ రావు, ప్రవీణ్  రావులను భూమా అఖిల ప్రియ అనుచరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆమెకు సికింద్రాబాద్‌లోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments