Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కూల్‌'గా మత్తు కలిపాడు.. అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (09:05 IST)
ఓ కామాంధుడు చేతిలో మరో యువతి మోసపోయింది. మాటలతో నమ్మించి మాయచేశాడు. ఆ తర్వాత కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి అత్యాచారం జరిపాడు. ఈ ఘాతుకాన్ని వీడియో తీసి.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక నర్సాపురంలో ఐడియో సెల్యూలార్ షోరూమ్ ఉంది. ఇక్కడ 19 యేళ్ళ యువతి పని చేస్తోంది. ఈమె భీమవరం నివాసి. ఈ క్రమంలో షాపునకు వస్తూపోతుండే రాంబాబు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. 
 
మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. వారిద్దరి మధ్య చనువు పెరగడంతో భీమవరంలోని ఆ యువతి ఇంటికి కూడా వెళ్లసాగాడు. ఓ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఆ యువతికి ఇచ్చాడు. ఆ తర్వాత తన లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసి కొంతకాలంగా బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. దీంతో విసిగిపోయిన యువతి భీమవరం పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. రాంబాబు సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అతని సొంతూరు ఏనుగువాని లంక అని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments