Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కూల్‌'గా మత్తు కలిపాడు.. అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (09:05 IST)
ఓ కామాంధుడు చేతిలో మరో యువతి మోసపోయింది. మాటలతో నమ్మించి మాయచేశాడు. ఆ తర్వాత కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి అత్యాచారం జరిపాడు. ఈ ఘాతుకాన్ని వీడియో తీసి.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక నర్సాపురంలో ఐడియో సెల్యూలార్ షోరూమ్ ఉంది. ఇక్కడ 19 యేళ్ళ యువతి పని చేస్తోంది. ఈమె భీమవరం నివాసి. ఈ క్రమంలో షాపునకు వస్తూపోతుండే రాంబాబు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. 
 
మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. వారిద్దరి మధ్య చనువు పెరగడంతో భీమవరంలోని ఆ యువతి ఇంటికి కూడా వెళ్లసాగాడు. ఓ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఆ యువతికి ఇచ్చాడు. ఆ తర్వాత తన లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసి కొంతకాలంగా బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. దీంతో విసిగిపోయిన యువతి భీమవరం పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. రాంబాబు సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అతని సొంతూరు ఏనుగువాని లంక అని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments