Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో "పేసీఎం" - ఆంధ్రప్రదేశ్‌లో 'భారతిపే'

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (19:27 IST)
కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. "పేసీఎం" అంటూ కర్నాటక వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రతి పనికీ 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారని అర్థం వచ్చేలా "పే సీఎం'' పోస్టర్లు వెలిశాయి. 
 
ఇపుడు ఇదే తరహా పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిశాయి. అయితే, ఇక్కడ "పే సీఎం" స్థానంలో "భారతిపే" పేరుతో వెలిశాయి. ఈ పోస్టర్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఫోటోను సైతం ముద్రించారు. 
 
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కాంలో అనేక  వైకాపా నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో సీఎం సతీమణి భారతీ రెడ్డి పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో 'భారతిపే' పేరుతో పోస్టర్లు వెలవడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను చర్చకు దారితీశాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments