Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడోసారి కూడా ఆడబిడ్డ.. భర్త ముఖం చాటేశాడు.. అమ్మేయాలనుకుంది

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (17:02 IST)
కన్నపేగునే అమ్ముకునేందుకు సిద్ధపడింది ఓ మాతృమూర్తి. బెజవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త నిరాదరణ, కుటుంబ పోషణ భారం కావడంతో ఇక దారిలేక 13 రోజుల శిశువును రూ.1.1 లక్షలకు విక్రయించింది. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెజవాడ, గొల్లపాలెంగట్టుకు చెందిన సాయిలక్ష్మీ అనే మహిళ తాను నవమాసాలు మోసి కన్న శిశువును అమ్మకానికి పెట్టింది. నవంబర్ 30వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆడ శిశువు జన్మనిచ్చిన ఆమె.. మరో మహిళ సాయంతో హైదరాబాదుకు చెందిన వారికి 13 రోజుల పాపను రూ.1.10లక్షలకు అమ్మేయాలనుకుంది. 
 
కానీ ఈ విషయాన్ని గుర్తించిన అంగన్‌వాడీ సిబ్బంది.. చిన్నారి విక్రయాన్ని అడ్డుకుని తల్లి, మధ్యవర్తిని ఐసీడీఎస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మనివ్వడంతో భర్త మొహం చాటేశాడని.. ఇంకా పిల్లల పోషణ భారం కావడంతోనే బిడ్డను విక్రయానికి పెట్టానని ఆ తల్లి వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments