Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త టీడీపీ.. కోడలు వైసీపీ.. ఇద్దరూ పోటీ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (09:03 IST)
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఓబీఆర్‌కండ్రిగ పంచాయతీ సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించారు. 1269 మంది ఓటర్లున్న పంచాయతీలో ఓబీఆర్‌కండ్రిగ, రామరాజుకండ్రిగ, పాపరాజుకండ్రిగతోపాటు రెండు ఎస్సీకాలనీలు, ఓ ఎస్టీ కాలనీ ఉంది.

కాగా, ఓబీఆర్‌కండ్రిగకు చెందిన శ్రీవిద్య గత పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సర్పంచ్‌ పదవికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

దీంతో ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుగా సర్పంచ్‌ పదవికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఓ అడుగు ముందుకేసి ఆమె అత్త తులసమ్మను రంగంలోకి దింపి రసవత్తర పోరుకు తెరలేపారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభావతి కూడా పోటీ పడుతున్నారు. 

పంచాయతీలో క్షత్రియులు, యాదవులు, ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్నారు. దీంతో అత్తాకోడళ్లు అన్ని సామాజికవర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగారు. అయితే ముక్కోణపు పోటీ ఉన్నా, అత్తాకోడళ్ల నడుమ ప్రధాన పోటీ నెలకొందని స్థానిక ఓటర్లు అంటున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన మహిళలు ఎన్నికల బరిలో నిలవడంతో ఓటర్ల అయోమయానికి గురవుతున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ మద్దతుదారు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆయకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఈ రసవత్తర పోరులో అత్తాకోడళ్లలో ఎవరికి పైచేయి అవుతుందో?!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments