Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీరం దాటిన అసని తుఫాను - భారీ వర్షాలు కురిసే అవకాశం

Webdunia
గురువారం, 12 మే 2022 (08:12 IST)
భయోత్పాతం సృష్టించిన అసని తుఫాను ఎట్టకేలకు మచిలీపట్నం - నరసాపురం మధ్య తీరం దాటింది. ఈ తుఫాను బలహీనపడి తీరం దాటినప్పటికీ వచ్చే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు ముగ్గురు మరణించగా, 900 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అలాగే, అనేక విమాన సర్వీసులను నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, ఈ తుఫాను తీరం దాటినప్పటికీ గురువారం రాత్రికి ఉత్తర దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ తుఫాను కారణంగా విశాఖపట్టణం, శ్రీకాకుళం, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 900 ఎకరాల్లోని పంటకు నష్టం వాటిల్లినట్టు అంచనా. 
 
మరోవైపు, అసని తుఫాను తీవ్రవాయుగుండంగా మారినప్పటికీ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మత్స్యుకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments