Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ మార్చుకున్న అసని తుఫాను - కోస్తాంధ్రకు ముప్పు

cyclone
, సోమవారం, 9 మే 2022 (22:13 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న అసని తుఫాను తన దిశను మార్చుకుంది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అని.. ప్రస్తుతం విశాఖపట్టణానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు భారత వాతవరణ శాఖ వెల్లడించింది. 
 
అయితే, ఈ తుఫాను తొలుత ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా తీరంవైపు వెళుతుందని అంచనా వేశారు. కానీ, ఇపుడు ఈ తుఫాను దశ మార్చుకుని కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్టు సమాచారం. దీంతో కోస్తాంధ్రతో పాటు తమిళనాడుకు ఈ తుఫాను ముప్పు పొంచివుంది. 
 
అయితే, భారత వాతావరణ శాఖ సోమవారం వేసిన అంచనా ప్రకారం తుఫాను మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తీరాన్ని చేరుకునే అవకాశం లేదు.
 
మే 11 తేదీన ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసని తుఫాను ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది. నర్సీపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడలలో వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కడప జిల్లాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మరో జాబ్ నోటిఫికేషన్ - 1271 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన