Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికి రైల్వే లైను లేనట్లే!

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:51 IST)
ఏపీ రాజధాని అమరావతికి నూతన రైల్వే లైను నిర్మాణం లేనట్లే కనిపిస్తోంది. ఆదివారం ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో వెల్లడైంది.

రాజధానికి రైల్వే కనెక్టివిటీ కల్పించడంలో భాగంగా 2016-17 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి గుంటూరు వయా అమరావతి (67 కిలోమీటర్లు) కొత్త లైనును ప్రకటించింది. అందుకు సంబంధించిన సర్వే కోసం 2016లో రూ.7 లక్షలు కేటాయించింది.

దీన్ని ఒక హామీగా పరిగణించిన ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం.. ఈ ప్రాజెక్టు పురోగతిపై అధ్యయనం ప్రారంభించింది. కాగా, ఈ ప్రాజెక్టును హామీల జాబితా నుంచి తొలగించాలని కమిటీని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

సర్వే నిర్వహించడం అంటే ప్రాజెక్టును మంజూరు చేస్తామన్నట్లు కాదని, సర్వే  ఆధారంగా ప్రాజెక్టును మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయిస్తామని తెలిపింది. అనంతరం ఈ అంశాన్ని కమిటీ తన అధ్యయనం నుంచి తొలగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments