Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికి రైల్వే లైను లేనట్లే!

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:51 IST)
ఏపీ రాజధాని అమరావతికి నూతన రైల్వే లైను నిర్మాణం లేనట్లే కనిపిస్తోంది. ఆదివారం ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో వెల్లడైంది.

రాజధానికి రైల్వే కనెక్టివిటీ కల్పించడంలో భాగంగా 2016-17 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి గుంటూరు వయా అమరావతి (67 కిలోమీటర్లు) కొత్త లైనును ప్రకటించింది. అందుకు సంబంధించిన సర్వే కోసం 2016లో రూ.7 లక్షలు కేటాయించింది.

దీన్ని ఒక హామీగా పరిగణించిన ప్రభుత్వ హామీల పార్లమెంటరీ స్థాయీ సంఘం.. ఈ ప్రాజెక్టు పురోగతిపై అధ్యయనం ప్రారంభించింది. కాగా, ఈ ప్రాజెక్టును హామీల జాబితా నుంచి తొలగించాలని కమిటీని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

సర్వే నిర్వహించడం అంటే ప్రాజెక్టును మంజూరు చేస్తామన్నట్లు కాదని, సర్వే  ఆధారంగా ప్రాజెక్టును మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయిస్తామని తెలిపింది. అనంతరం ఈ అంశాన్ని కమిటీ తన అధ్యయనం నుంచి తొలగించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments