Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంపు.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డుల పంపిణీ

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (14:39 IST)
ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 
 
ఏపీలో నేటి నుంచి కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 25 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. 4 కోట్ల 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేశారు.
 
గత ప్రభుత్వ హయాంలో అవసరమైన 104,108 వాహనాలు అందుబాటులో ఉండేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 104, 108 కింద 2,200 వాహనాలు తిరుగుతున్నాయని, పేద ప్రజలకు అత్యంత వేగంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
 
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశారని సీఎం జగన్ అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆరోగ్యశ్రీని అందించామన్నారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు లైఫ్ సపోర్టు కింద హెల్త్ సపోర్టు అందజేస్తున్నారు.
 
55 నెలల కాలంలో వైద్యరంగంలో సంస్కరణలకు రూ.32,279 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments