Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోనసీమ జిల్లాలో దళిత బాలికకు అవమానం - చికిత్స కోసం వెళితో కాలితో తొక్కి...

doctor
, సోమవారం, 18 డిశెంబరు 2023 (10:20 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ దళిత బాలికను నర్సు కాలితో తొక్కి పరీక్షిస్తూ అవమానించింది. ఈ ఘటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కర రావు తన పదేళ్ల మనవరాలు కాలినొప్పితో బాధపడుతుంటే ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడున్న నర్సు మణికుమారి మాత్రం చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది. పైగా, చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లాని సూచించింది. 
 
దీంతో నర్సుపై భాస్కర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగిని అవమానించినందుకు పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో నర్సు క్షమాపణ చెప్పింది. కాగా, సదరు నర్సు డిప్యుటేషన్‌పై తమ ఆస్పత్రిలోనే పని చేస్తుందని వైద్యురాలు నిఖిత తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో మళ్లీ కరోనా కలకలం.. 335 కొత్తకేసులు.. ఐదుగురు మృతి