Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టిన ఏపీ మంత్రి సవిత

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (12:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆర్టీసీ బస్సు నడిపిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో అటు ఆర్టీసీ అధికారులతో పాటు పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాయి. సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీసీ డిపోకు నూతనంగా రెండు బస్సులు మంజూరు అయ్యాయి, ఈ నేపథ్యంలో సోమవారం పెనుకొండ బస్టాండ్‌‍లో నూతనంగా మంజూరైన రెండు ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఓ బస్సు ట్రైల్ రన్ చేశారు. మంత్రి సవిత స్టీరింగ్ పట్టుకుని బస్సు నడపడంతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కల్పనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కొత్త బస్సులను గత ప్రభుత్వంలో కొనుగోలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 బస్సులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం మధుసూధన్, సిబ్బంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments