బాణాసంచా పేలి 154 మందికి గాయాలు... ఎక్కడ? (Video)

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (11:31 IST)
కేరళ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ కోసం నిల్వవుంచిన బాణాసంచా పేలి 154 మంది గాయపడ్డారు. నిప్పు రవ్వలు ఎగిసిపడి గదిలో నిల్వచేసిన బాణాసంచాకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులంతా ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనలో 154 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజుతంబళం వీరెర్కవు ఆలయంలో గత అర్థరాత్రి జరిగింది. సంప్రదాయ తెయ్య పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయానికి తరలివచ్చారు. 
 
ఈ సందర్భంగా టపాసులు పేల్చిన నిప్పు రవ్వలు బాణాసంచా నిల్వచేసి గదిలోకి వెళ్లాయి. దీంతో మంటలు చెలరేగి ఆ గదిలో నిల్వవుంచిన బాణాసంచా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి జరిగే ఉత్సవంతో ఈ ఆలయ వేడుకలు ముగియాల్సి వుండగా ఈ అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు ఆలయ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments