Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా పేలి 154 మందికి గాయాలు... ఎక్కడ? (Video)

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (11:31 IST)
కేరళ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ కోసం నిల్వవుంచిన బాణాసంచా పేలి 154 మంది గాయపడ్డారు. నిప్పు రవ్వలు ఎగిసిపడి గదిలో నిల్వచేసిన బాణాసంచాకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులంతా ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనలో 154 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజుతంబళం వీరెర్కవు ఆలయంలో గత అర్థరాత్రి జరిగింది. సంప్రదాయ తెయ్య పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయానికి తరలివచ్చారు. 
 
ఈ సందర్భంగా టపాసులు పేల్చిన నిప్పు రవ్వలు బాణాసంచా నిల్వచేసి గదిలోకి వెళ్లాయి. దీంతో మంటలు చెలరేగి ఆ గదిలో నిల్వవుంచిన బాణాసంచా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి జరిగే ఉత్సవంతో ఈ ఆలయ వేడుకలు ముగియాల్సి వుండగా ఈ అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు ఆలయ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments