Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పన్ను కట్టకకపోతే తాళం వేయడంలో తప్పేముంది?

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (14:38 IST)
ఇంటిపన్ను వసూలులో పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు వ్యవహారించిన తీరును ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించారు. ఆస్తి పన్ను చెల్లించని ఇళ్ళను జప్తు చేయడంలో తప్పేముందనని ఆయన ప్రశ్నించారు. 
 
కాగా, ఏపీలోని వైకాపా ప్రభుత్వం పన్ను చెల్లించని వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, చెత్తపన్ను కట్టలేదనే కారణంతో దుకాణాల ముందు చెత్త వేసిన ఘటన విమర్శల పాలైన విషయం తెల్సిందే. ఇపుడు పిఠాపురంలో ఇంటిపన్ను చెల్లించలేదన్న కారణంగా ఇంట్లో ఆడవాళ్లు ఉండగానే మున్సిపల్ అధికారులు ఇంటికి తాళం వేశారు. అధికారుల చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కరెంట్ బిల్లు చెల్లించకపోతే కరెంట్ తీసేస్తామని చెప్పడంలో తప్పేముందన్నారు. ఆస్తుల జప్పు అనేది ఇపుడు కొత్తగా రాలేదన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడాన్ని తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినపుడు ఈ విధానాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన మండిపడ్డారు. పన్నులు చెల్లించకుంటే స్థానిక సంస్థలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments