Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పన్ను కట్టకకపోతే తాళం వేయడంలో తప్పేముంది?

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (14:38 IST)
ఇంటిపన్ను వసూలులో పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు వ్యవహారించిన తీరును ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించారు. ఆస్తి పన్ను చెల్లించని ఇళ్ళను జప్తు చేయడంలో తప్పేముందనని ఆయన ప్రశ్నించారు. 
 
కాగా, ఏపీలోని వైకాపా ప్రభుత్వం పన్ను చెల్లించని వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, చెత్తపన్ను కట్టలేదనే కారణంతో దుకాణాల ముందు చెత్త వేసిన ఘటన విమర్శల పాలైన విషయం తెల్సిందే. ఇపుడు పిఠాపురంలో ఇంటిపన్ను చెల్లించలేదన్న కారణంగా ఇంట్లో ఆడవాళ్లు ఉండగానే మున్సిపల్ అధికారులు ఇంటికి తాళం వేశారు. అధికారుల చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కరెంట్ బిల్లు చెల్లించకపోతే కరెంట్ తీసేస్తామని చెప్పడంలో తప్పేముందన్నారు. ఆస్తుల జప్పు అనేది ఇపుడు కొత్తగా రాలేదన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడాన్ని తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినపుడు ఈ విధానాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన మండిపడ్డారు. పన్నులు చెల్లించకుంటే స్థానిక సంస్థలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments