Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్ : ప్రకటించిన ప్రభుత్వం

ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్ : ప్రకటించిన ప్రభుత్వం
, సోమవారం, 21 మార్చి 2022 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యానికి క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని నిర్మయిచింది. అలాగే, గత మూడేళ్లుగా ఒక్క డిస్టిలరీ కంపెనీకి కొత్తగా అనుమతి ఇవ్వలేదని అంటోంది. ఈ విషయాన్ని స్పెషల్ సీఎస్ రంజిత్ భార్గవ్ వెల్లడించారు. 
 
రాష్ట్రంలో చివరి డిస్టిలరీ పర్మిషన్ గత 2019 ఫిబ్రవరిలో ఇచ్చారని గుర్తుచేసింది. ఆ తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే దేశంలో మరెక్కడాలేని విధంగా మద్యం క్వాలిటీ టెస్టింగ్ చేస్తున్నట్టు పేర్కొంది. గత 2014 నుంచి 2018 మధ్య యేడాదికి 99 వేల శాంపిల్స్ టెస్టులు చేసినట్టు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్‌పై దండయాత్ర.. రష్యాలో 170 శాతం పెరిగిన కండోమ్ అమ్మకాలు