Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్థం ఘటనలో కుట్ర కోణం ఉంది... చేధిస్తాం: మంత్రి అవంతి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:52 IST)
విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన దురదృష్టకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. రాముని విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్ష ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో కుట్ర కోణం ఉందని... దాన్ని చేధిస్తామని తెలిపారు.
 
ముఖ్యమంత్రి, డీజీపీ మతాలు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం చాలా బాధ కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో ఇతర దేవాలయలపై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు రామతీర్థం ఎందుకు సందర్శించారని ప్రశ్నించారు. 
 
తన సొంత జిల్లాలో ఉన్న తిరుమలకు వెళ్లి చంద్రబాబు ఒక్కసారి అయిన తలనీలాలు ఇచ్చారా అని నిలదీశారు. బీజేపీ, జనసేనకు దేవుళ్ళపై ఎంత భక్తి ఉందో తమకు అంతే భక్తి ఉందని మంత్రి చెప్పారు. బీజేపీ, జనసేన పార్టీలకు రాష్ట్రంపై అభిమానం ఉంటే.. విభజన హామీలను అమలుకు కృషి చేయాలని హితవుపలికారు. 
 
చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దన్నారు. తమ పార్టీపై క్రిస్టియన్ ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో 90 శాతానికి పైగా హిందువులు ఉన్నారని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణిని చంద్రబాబు మానుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments