Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోంది: బండి సంజయ్‌

ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోంది: బండి సంజయ్‌
, సోమవారం, 4 జనవరి 2021 (15:57 IST)
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనలపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని వ్యాఖ్యానించారు. హిందువుల కానుకలను దేవదాయశాఖ దారి మళ్లీస్తోందని ఆరోపించారు.
 
రాష్ట్ర ప్రజల సహనాన్ని పిరికితనంగా సీఎం జగన్‌ భావించొద్దని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భాజపా గెలుస్తుందని, తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్‌ ట్రీట్‌మెంట్‌ తప్పదని జోస్యం చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్‌ కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విగ్రహాలు ధ్వంసంపై ఏపీలో పోలీసు శాఖ అప్రమత్తం