Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు వచ్చారు... జాబులు వచ్చాయంటున్న మంత్రి అమరనాథ్ రెడ్డి

బాబు వస్తేనే జాబులు వస్తాయని ఎన్నికల సమయంలో చెప్పినట్లే బాబు వచ్చారు... జాబులు వచ్చాయని పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి అమరనాథ రెడ్డి చెప్పారు. శనివారం ఉయ్యూరులో విలేకరులతో మాట్లాడుతూ... తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలో ఎంతమ

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (21:02 IST)
బాబు వస్తేనే జాబులు వస్తాయని ఎన్నికల సమయంలో చెప్పినట్లే బాబు వచ్చారు... జాబులు వచ్చాయని పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి అమరనాథ రెడ్డి చెప్పారు. శనివారం ఉయ్యూరులో విలేకరులతో మాట్లాడుతూ... తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలో ఎంతమంది పనిచేస్తున్నారు, వారికి సంబంధించిన అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. బాబు వచ్చినా జాబు రాలేదని అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు సీఎం డ్యాష్ బోర్డు చూసి తెలుసుకోవాలని హితవు పలికారు. 
 
గత మూడేళ్లలో జరిగిన భాగస్వామ్య ఒప్పంద సదస్సుల్లో 17 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి, దాదాపు 35 లక్షల మందికి ఉపాధికి సంబంధించిన 1600 ఎంఓయులు చేసుకున్నామన్నారు. చేసుకున్న ఒప్పందాలను గ్రౌండింగ్ చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి తలియజేశారు. కియా, అపోలో టైర్స్ హీరో మోటార్ కార్స్, అశోక్ లేల్యాండ్ తదితర ప్రపంచస్థాయి ఆటోమొబైల్ కంపెనీలతో పాటు ఐటీ రంగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం సహకరించాలి కానీ బురద చల్లే ప్రయత్నాలు చేయరాదని సూచించారు. 
 
కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే వైకాపా, భాజపా, జనసేన పార్టీలు సమావేశానికి రాలేదు. అంటే... రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంపై ఆ పార్టీలకు నిబద్ధత లేదనేది అర్థమైందని మంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments