Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (17:49 IST)
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పెద్దల డిమాండ్లను పక్కన పెడుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
దీనిపై గతంలో పెను దుమారం రేగింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ముందు వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌ను అడ్డుకోడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆందోళన చెందారు. 
 
పార్టీలకు అంతీతంగా మాజీ సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు సైతం ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. అటు చిరంజీవి అధ్యక్షతను సీనీ పెద్దలు సీఎం జగన్‌కు కలిసి.. రేట్ల విషయంలో వెసులు బాటు ఇవ్వాలని కోరినట్టు కూడా ప్రచారం ఉంది. 
 
అయితే తరువాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు వకీల్ సాబ్ సినిమా హిట్ అయినా.. ప్రభుత్వం నిర్ణయం కారణంగానే నష్టాలు వచ్చేయనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments