Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌రిటాల‌లో ఎన్టీయార్ విగ్ర‌హం చేయి విర‌గొట్టారు...

Webdunia
బుధవారం, 7 జులై 2021 (17:44 IST)
కృష్ణాజిల్లా కంచికచర్ల మండ‌లం పరిటాలలో ఎన్టీ రామారావు విగ్రహం చేయిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు  విరగకొట్టారు. దీనితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప‌రిశీలించారు. 
 
నేషనల్ హైవే పక్కన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయ‌డానికి దుండగులకు ఎంత ధైర్యం? అని దేవినేని ప్ర‌శ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత త‌మ‌ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టడం చంపడం చేస్తున్నార‌ని ఆరోపించారు.

మొదట్లోనే వారి మీద కేసులు పెట్టి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదా ? అని ప్ర‌శ్నించారు. నందిగామ జెండా దిమ్మ పగలగొట్టిన వారిపై ఎంత మంది పైన కేసులు పెట్టారు .. ఏమి చర్యలు తీసుకున్నారు? అని ప్ర‌శ్నించారు. 
 
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజాప్రసాదం నుంచి బయటకు రాడు... ఒక పక్క కృష్ణ జలాలు నీటి వివాదం.. మీ చేతిలో 28 మంది ఎంపీలు ఉండీ ఉపయోగం ఏమిటి? మీరు కోటలో ఉంటే, ఏమిటి పేటలో ఉంటే ఏమిటి! నారుమళ్లకు నీళ్లు ఇవ్వలేరు కానీ, విగ్రహాలు మాత్రం పగలగొడతారు ఈ దద్దమ్మలు... అని ఎద్దేవా చేశారు దేవినేని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments