Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ ఇంటి ముందే ఉద్య‌మిస్తాం: జ‌న‌సేన ప‌వ‌న్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (16:52 IST)
సిఎం జ‌గ‌న్ భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా? ఆడపడుచులను పచ్చి బూతులు తిడతారా? 
ఇటువంటి నాయకులు ఉంటే..‌మానభంగాలు ఎలా ఆగుతాయి? సిఎం ఇంటి‌చుట్టూ ఉన్న‌వారికే రక్షణ లేదు... అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

సీఎం నివాసం తాడేప‌ల్లిలో 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాల‌ని, భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడర‌ని, ఖాళీ చేయించడం తప్పనిసరైతే, వారికి ముందు న్యాయం చేయాలి... 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే వారిని తొలగించాల‌న్నారు. కాద‌ని, మొండిగా ముందుకెళితే... జనసేన తరపున సిఎం నివాసం వద్దే ఉద్యమిస్తాం అని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. 
 
జ‌న‌సేన కార్యాల‌యంలో పవన్ కళ్యాణ్‌ను తాడేపల్లి అమరరెడ్డి కాలనీవాసులు క‌లిసి, త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ‌నివాసం‌ చుట్టూ ఉన్నవారికి ఖాళీ‌ చేయాలని నోటీసులు ఇచ్చారు. తొలుత వేరే స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ‌ చేయాలని బెదిరిస్తున్నార‌ని, అర్ధరాత్రి ప్రొక్లెయిన్ లను ఇళ్ల మీదకు పంపిస్తున్నార‌ని, అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి‌ బెదిరిస్తున్నార‌ని బాధితులు ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా ఉంటున్న మాకు గూడు లేకుండా చేస్తున్నార‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌కు అండగా నిలబడి ఉద్యమం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments