Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం : కొత్త జిల్లాల ఏర్పాటుకు సబ్ కమిటీలు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (18:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం నాలుగు సబ్ కమిటీలని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. 
 
ఏపీలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సబ్‌ కమిటీలతో పాటు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను ఓ కమిటీకి, సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను మరో కమిటీకి అప్పగించారు.
 
అలాగే, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం బాధ్యతలు మూడో కమిటీకి, సాంకేతిక సంబంధిత అధ్యయన బాధ్యతలను నాలుగో కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్‌ కమిటీలకు అవసరమైన సాయం చేయడం కోసం కలెక్టర్‌ ఛైర్మన్‌గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments