Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు షాకిచ్చిన భారతీయ రైల్వే : వందే భారత్ రైళ్ల టెండర్లు రద్దు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (15:55 IST)
చైనాకు భారత్ మరోమారు షాకిచ్చింది. అయితే, ఈ దఫా షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదు. భారతీయ రైల్వే. వందే భారత్ కింద 44 సెమీ హైస్పీడ్ రైళ్ళ తయారీ కోసం ఇచ్చిన టెండర్లను రద్దు చేసినట్టు భారతీయ రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 
 
'వందే భారత్'లో భాగంగా 44 సెమీ హైస్పీడ్‌ రైల్వే తయారీకి ఇచ్చిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. వారం రోజుల్లోగా మళ్లీ టెండర్లు పిలిచి ఖరారు చేస్తామని, కేంద్రం చేపట్టిన మేక్‌‌ఇన్‌ ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు' ప్రకటించింది. 
 
ఈ నిర్ణయంతో చైనాకు మరో దెబ్బ తగిలినట్లయింది. చైనా జాయింట్ వెంచర్, సీఆర్‌ఆర్‌సీ పయనీర్‌ ఎలక్ట్రిక్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ 44 సెట్ల సెమీ హైస్పీడ్ రైళ్లను సరఫరా చేసే ఆరుగురు పోటీదారుల్లో ఏకైక విదేశీ బిడ్డర్‌గా ఉంది. 'సెమీ హైస్పీడ్‌ రైలు 44 సెట్ల (వందేభారత్‌) తయారీ టెండర్‌ రద్దయింది. సవరించిన పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ (మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాధాన్యత) ఆర్డర్‌ ప్రకారం వారం రోజుల్లోగా తాజాగా టెండర్‌ ఇవ్వనున్నట్లు' రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments