Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాకు షాకిచ్చిన బిహార్ : గాంధీ వంతెన టెండర్ రద్దు

చైనాకు షాకిచ్చిన బిహార్ : గాంధీ వంతెన టెండర్ రద్దు
, సోమవారం, 29 జూన్ 2020 (09:00 IST)
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చైనాకు షాకిచ్చారు. చైనా కంపెనీలతో భాగస్వామ్యంతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేశారు. ఈ వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చైనాకు చెందిన రెండు కంపెనీలతో భాగస్వామ్యం ఉండటంతో ఈ టెండర్‌ను రద్దు చేశారు. భాగస్వాములను మార్చుకోమని చెప్పినా కాంట్రాక్టర్లు నిరాకరించడంతో చివరకు టెండర్‌నే రద్దు చేసినట్లు బీహార్ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ తెలిపారు. 
 
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి భారత జవాన్లపై రాళ్లు, మేకులు కొట్టిన లాఠీలతో దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపునుంచి కూడా అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఈ విషయంపై చైనా ఎక్కడా పెదవి విప్పలేదు. అయితే, రెండు వైపులా నష్టం జరిగిందని మాత్రమే డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. 
 
అదేసమయంలో జూన్ 15వ తేదీ దాడిలో చనిపోయిన భారత జవాన్లలో ఐదుగురు బీహారీలే ఉన్నారు. దీంతో చైనాపై బీహారీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ క్రమంలోనే గాంధీ వంతెన టెండర్ రద్దు చేశారు. త్వరలో చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను బీహార్ ప్రభుత్వం రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా అండతో రెచ్చిపోయిన నేపాల్.... భారత్‌తో కవ్వింపు చర్యలు