Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి తేజ మృతిపై గవర్నర్ బిశ్వ‌భూష‌న్ సంతాపం

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:28 IST)
తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా అధికారి లాన్స్ నాయక్ బి. సాయి తేజ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. లాన్స్ నాయక్ బి. సాయి తేజ 2013లో జవాన్‌గా ఆర్మీలో చేరారని, ఆయన అత్యుత్తమ పనితీరు ఆధారంగా సిడిఎస్‌కు పిఎస్‌ఓగా నియమితులయ్యారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు.
 
 
అతి చిన్న వయసులో లాన్స్ నాయక్ సాయి తేజ ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.  మరోవైపు హెలికాప్టర్‌లోని ఇతర రక్షణ సిబ్బందితో పాటు ప్రాణాలు కోల్పోయిన ఒడిశాలోని అంగుల్ జిల్లా కృష్ణచంద్రపూర్ గ్రామానికి చెందిన భారత వైమానిక దళానికి చెందిన జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్ మృతి పట్ల గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం కారణంగా పలువురు ఇతర  అధికారులు అకాల మరణం చెందటంపై ఆవేదన వ్యక్తం చేశార. భారతావని రక్షణ కోసం వీరు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరనీయమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments