Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి పెన్షన్ మంజూరు చేయమంటే కోరిక తీర్చమన్న అధికారి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:02 IST)
రిటైర్డ్ ఉపాధ్యాయుడు అయిన తన తండ్రి మరణానంతరం రావాల్సిన పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరిన ఓ యువతిని ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. తన సినిమాకు వస్తావా, కోర్కె తీరుస్తావా అంటూ లైంగక వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ టీచరుగా పని చేసి పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత ఆయన భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వీరి కుమార్తె అనాథగా మారింది. 
 
అయితే, తన తండ్రికి మరణానంతరం రావాల్సిన పింఛను మంజూరు చేయాలని ఆ యువతి స్థానిక ట్రెజరీ కార్యాలయ ఉన్నతాధికారి పవరన్ కుమార్‌ను సంప్రదించింది.
 
కానీ, ఆయన తన కోర్కె తీరుస్తానంటే పెన్షన్ మంజూరు చేస్తానంటూ వేధించసాగాడు. దీంతో ఆయవతి స్థానిక తెరాస నేతల దృష్టికి తీసుకెళ్లింది. వారు మధ్యవర్తిత్వం చేసి అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. 
 
అయితే, ఆ యువతి చెప్పేవని అబద్దాలేనని ట్రెజరీ అధికారి పవన్ కుమార్ అంటున్నారు. నిబంధనల ప్రకారం ఆ యువతి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం