తండ్రి పెన్షన్ మంజూరు చేయమంటే కోరిక తీర్చమన్న అధికారి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:02 IST)
రిటైర్డ్ ఉపాధ్యాయుడు అయిన తన తండ్రి మరణానంతరం రావాల్సిన పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరిన ఓ యువతిని ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. తన సినిమాకు వస్తావా, కోర్కె తీరుస్తావా అంటూ లైంగక వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ టీచరుగా పని చేసి పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత ఆయన భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వీరి కుమార్తె అనాథగా మారింది. 
 
అయితే, తన తండ్రికి మరణానంతరం రావాల్సిన పింఛను మంజూరు చేయాలని ఆ యువతి స్థానిక ట్రెజరీ కార్యాలయ ఉన్నతాధికారి పవరన్ కుమార్‌ను సంప్రదించింది.
 
కానీ, ఆయన తన కోర్కె తీరుస్తానంటే పెన్షన్ మంజూరు చేస్తానంటూ వేధించసాగాడు. దీంతో ఆయవతి స్థానిక తెరాస నేతల దృష్టికి తీసుకెళ్లింది. వారు మధ్యవర్తిత్వం చేసి అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. 
 
అయితే, ఆ యువతి చెప్పేవని అబద్దాలేనని ట్రెజరీ అధికారి పవన్ కుమార్ అంటున్నారు. నిబంధనల ప్రకారం ఆ యువతి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం