Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు: వ్యవసాయ భూమిలో 30 క్యారెట్ల వజ్రం.. విలువ రూ.2కోట్లు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, దూకిలి, మహానంది, మహదేవపురం గ్రామాల్లో మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పొలాల్లో వర్షాల తర్వాత వజ్రాలు లభించాయి. గతేడాది 2019లో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో లభించిన రూ.60 లక్షల విలువైన వజ్రాన్ని స్థానిక వ్యాపారికి మంచి మొత్తానికి విక్రయించాడు. 
 
2 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా రైతులు 2 ఖరీదైన వజ్రాలు కనుగొని మంచి మొత్తానికి విక్రయించినట్లు కూడా చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో 30 క్యారెట్ల వజ్రం దొరికింది. దానిని అనంతపురం జిల్లాలోని వజ్రాల వ్యాపారికి రూ.2 కోట్లకు విక్రయించి ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆకాశం నుంచి వజ్రాలు కురుస్తున్నాయని ప్రచారం జరిగింది. 
 
దీంతో కర్నూలు జిల్లా రైతులు తమ రోజువారీ పనులను పక్కనబెట్టి కుటుంబ సమేతంగా పొలాల్లో రాత్రింబవళ్లు వేచి ఉన్నారు. అక్కడ తాత్కాలిక టెంట్లు వేసుకుని వజ్రాలు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
దీనిపై సమాచారమందుకున్న రెవెన్యూశాఖ, జియోలాజికల్ సర్వేయర్లు వజ్రాలు లభించినట్లు చెబుతున్న గ్రామాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments