Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైర్ బ్రాండ్‌కు షాకిచ్చిన ఏపీ సీఎం జగన్.. ఆ పదవి నుంచి తొలగింపు?

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (10:21 IST)
ఏపీ సీఎం జగన్.. నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజా ఉన్నారు. ఈ పదవిలో కీలకంగా వ్యవహరించిన రోజాకు సీఎం జగన్ ఊహించని షాకిచ్చారు. ఆమెను పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు. 
 
బుధవారం వైసీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రకటించిన అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించగా.. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజాను తప్పించి ఆమె స్థానంలో ఎమ్మెల్సీ పోతుల సునీతకు బాధ్యతలు అప్పగించారు.
 
ఐతే రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆమెకు మహిళా విభాగం బాధ్యతను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. రోజా మంత్రిగా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.  
 
జులై 8న వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పార్టీలో వ్యవస్థాగత మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహించి పార్టీ పదవులను భర్తీ చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కీలక పదవులను ప్లీనరీ సందర్భంగా ప్రకటించే అవకాశముంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments