Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు పారిస్‌ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్

Advertiesment
నేడు పారిస్‌ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
, మంగళవారం, 28 జూన్ 2022 (08:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నుంచి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు తన సతీమణితో కలిసి వెళుతున్నారు. పలు అవినీతి కేసుల్లో నిందితుడుగా ఉన్న సీఎం జగన్‌కు విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నెల 28వ తేదీ నుంచి జూలై పదో తేదీ వరకు పారిస్‌లో పర్యటించేందుకు సమ్మతం తెలిపింది. 
 
జగన్ కుమార్తె పారిస్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు. తన కుమార్తె విద్యనభ్యసిస్తున్న కళాశాల స్నాతకోత్సవంలో హాజరయ్యేందుకు ఆయన పారిస్ వెళుతున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం రాత్రి 7.30 గంటలకు గన్నవరం నుంచి పారిస్‌కు బయలుదేరే జగన్ జూన్ రెండో తేదీ వరకు అక్కడే ఉంటారు. జూలై 3వ తేదీన తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. సీఎం జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలు