Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు అమ్మఒడి మూడో విడత నిధుల విడుదల

ysjagan
, సోమవారం, 27 జూన్ 2022 (09:50 IST)
శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం వేదికగా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ఈ నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత లబ్దిదారులను ఉద్దశించి ఆయన ప్రసంగిస్తారు. 
 
ఇందుకోసం సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళంకి చేరుకుంటారు. 11 గంటల సమయంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు అమ్మఒడితో లబ్ది చేకూరుస్తూ రూ.43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6595 కోట్లను ముఖ్యమంత్రి స్వయంగా బటన్ నొక్కి జమ చేస్తారు. ఆ తర్వాత ఆయన అమ్మఒడి లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడుతారు. పిమ్మట 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలోని గ్రాఫిక్స్‌ను లీజుకు ఎలా ఇస్తారు : సర్కారుకు రైతుల ప్రశ్న!