హస్తినకు వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (12:46 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం హస్తినకు వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర పెద్దలతో సమావేశంకానున్నారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అలాగే ఈ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. 
 
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో ఈ పర్యటనలో పోలవరం అంశాన్ని ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. 
 
అలాగే, మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్ గురించి కేంద్రంలోని కీలక మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ యేడాదిలోనే ఆయనపై ఉన్న పలు కేసుల విచారణ ప్రారంభంకానుంది. ఈ అంశంపై కూడా ఆయన హోం మంత్రి అమిత్ షా వద్ద చర్చించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments