వాడిగా వేడిగా... ఏపీ అసెంబ్లీ సమావేశాలు; టీడీపీ తీర్మానానికి నో!

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (10:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇటీవ‌ల జ‌రిగిన రాజ‌కీయ దుమారాల నేప‌థ్యంలో, స్థానిక ఎన్నిక‌ల హీట్ త‌ర్వాత జ‌ర‌గుతున్న అసెంబ్లీ స‌మావేశాలివి. ప్రారంభం నుంచే స‌మావేశాలు వాడిగా వేడిగా మొద‌ల‌య్యాయి.
 
 
ముందుగా, ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాల్లో తొలుత బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్‌ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది.
 
 
అయితే, పొలిటిక‌ల్ హీట్ ఎక్కించ‌డానికి టీడీపీ చేసిన తొలి ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌  తమ్మినేని సీతారాం తిరస్కరించారు.  దీనితో టీడీపీ స‌భ్యులు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments