Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమయం వద్దు తమ్ముళ్లూ.. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (11:29 IST)
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును అనుసరించి కొంతకాలం పాటు కొత్త ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయొద్దని భావించానని, అయితే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలే లక్ష్యంగా, పార్టీ కేడర్ పైన దాడులు చేస్తూ ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. ఆరు నెలల పాటు ప్రభుత్వ పనితీరు చూసి సహేతుకమైన విమర్శలు చేసి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని అనుకున్నా కానీ ప్రభుత్వ తీరు సరిగా లేదు అని సమావేశంలో పేర్కొన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు జరిగితే పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. అంతేకాదు పార్టీ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి కార్యకర్తల సమస్యలను పరిష్కారించాలన్నారు. కార్యకర్తల మీద దాడులు జరిగిన సందర్భాల్లో సంఘీభావ యాత్రలు చేయడం ద్వారా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. మరి దేశం నేతలు జగన్ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి రివర్స్ ఎటాక్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments