Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు కోరిక నెరవేరదు.... జేసీ దివాకర్ రెడ్డి

చంద్రబాబు కోరిక నెరవేరదు.... జేసీ దివాకర్ రెడ్డి
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:44 IST)
దేశాన్ని మార్చడం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చేతయ్యేది కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం... మంగళవారం జంతర్‌‌మంతర్‌ దగ్గర ఎంపీ మాగంటి బాబు చేపట్టిన నిరాహారదీక్షకు టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న చంద్రబాబు కోరిక నెరవేరదనీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేస్తారన్న ఆశతో చంద్రబాబు రాహుల్‌ వెంట పడుతున్నారన్నారు.
 
ప్రధాని మోడీ ఒక ఫ్యాక్షన్‌ లీడర్‌లా, నియంతలా వ్యవహరిస్తున్నారనీ విమర్శించిన జేసీ రైల్వే జోన్‌ వల్ల ఏపీకి లాభం లేదనీ, ప్రభుత్వానికీ నష్టం లేదని ఆయన అన్నారు. కక్ష సాధించడం కోసమే కేంద్రం రైల్వేజోన్‌ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఉన్నంతవరకు ప్రజలకు సంక్షేమం అందుతుందని, ఎన్నికలకు ముందే రైతులకు చెక్కులు ఇస్తామనీ జేసీ దివాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈరోజు అర్థరాత్రి నుంచి ఆర్టీసి బస్సులు తిరగవంతే...