Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగంలో ఉన్న రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయితే, చాలా మంది ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. ఇలాంటి వారికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ కారణంగా వారికి రేషన్ బియ్యం ఇవ్వంటూ ప్రచారం సాగింది. దీంతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసే గడువును ఏపీ ప్రభుత్వం పొడగించింది. 
 
చిత్తూరు జిల్లాలో 1379 చౌక దుకాణాలుండగా అందులో 5.36 లక్షల కార్డులు, 16.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఇంకా 1.12 లక్షల మంది 8-9 శాతం మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇలాంటి వారు ఆన్‌లైనులో ఈకేవైసీ స్టేటస్ సొంతంగా తెలుసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు సూచిస్తున్నారు. 
 
గూగుల్ వెబ్ బ్రౌజర్‌లో ఈపీడీఎస్-1 అని నమోదు చేసి ఎంటర్ నొక్కాలి. అపుడు డిపార్టుమెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ అండ్ సివిలి సప్లైస్ ఏపీ అనే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో డాష్ బోర్డును ఎంపిక చేసుకోవాలి. దానిలో బియ్యం కార్డు విభాగంలో ఆరు రకాల ఆప్షన్లు ఉంటే న్యూ అనే పేరుతో కనిపించే దానిపై క్లిక్ చేయాలి. ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్స్ లేదా రైస్ కార్డు సెర్చ్ అనే గుర్తుల్లో ఒకదానిని క్లిక్ చేసి బియ్యం కార్డు నంబరు నమోదు చేస్తే అందులో ఉన్న పేర్లు వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments