2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానాన్ని దక్కించుకుందని ఒక జాతీయ నివేదిక తెలిపింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధిస్తోందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది.
ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ,"1990లలో, నేను మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో ఉండేది, బెంగళూరు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కానీ నేడు, హైదరాబాద్ అన్ని రంగాలలో నంబర్ వన్గా నిలిచింది" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
అలాగే ప్రస్తుతం ఏపీ అభివృద్ధికి పాటుపడాలి. కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ.. కొత్త అవకాశాన్ని ఎదుర్కొంటున్నాం. మనం దీన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. ఏపీ నెంబర్ 2 స్థానంలో ఉండటం అంటే మనం మరింత కష్టపడి పనిచేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.