Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

Advertiesment
rain

ఠాగూర్

, బుధవారం, 16 ఏప్రియల్ 2025 (10:03 IST)
ఈసారి నైరుతి సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత యేడాది కోస్తాలో శ్రీకాకుళం, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. అయితే, ఈసారి మాత్రం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ వెల్లడించింది. 
 
ఈ యేడాది జూన్- సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. వరుసగా రెండో యేడాది కూడా నైరుతి సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపింది. దీర్ఘాలిక సగటు 87 సెంటీమీటర్లు కాగా, వర్షపాతంతో పోలిస్తే ఈసారి ఇది 105 శాతం వర్షాలు కుస్తాయని పేర్కొంది. అయితే, ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసినప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాలకు అది సమానంగా ఉండే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో నుంచి సూపర్ రీఛార్జ్ ఆఫర్.. రూ.299లకే 2.5GB డేటా, అపరిమిత కాల్స్