Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు హస్తినబాట పట్టనున్న ఏపీ సీఎం జగన్

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (14:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు హస్తినబాట పట్టనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మాకొట్టిమరీ ఢిల్లీ వెళ్లిన సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు ఆయన హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లనుండటం చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, మంగళవారం విశాఖపట్టణం వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. విదేశీ ప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రసంగిస్తారు. రాత్రికి తాడేపల్లికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత బుధవారం ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఒక రోజు రాత్రి బస చేసి మరుసటి రోజున ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. అయితే, ఈ పర్యటనలో ఆయన ఎవరితో సమావేశంకానున్నారు, ఏఏ అంశాలపై చర్చిస్తారు అనే వివరాలు తెలియాల్సి వుంది. గడిచిన రెండు వారాల్లో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments