Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా 104 అంబులెన్స్‌ల కొనుగోలుకు ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:05 IST)
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు భారీగా 104 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 539 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ.89.27 కోట్ల ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 అంబులెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.
 
ఇందుకు సంబందించిన నిధులను వెంటనే విడుదల చేయాలనీ ఫైనాన్స్ శాఖను ఆదేశించారు సీఎం.. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అంబులెన్స్ కేటాయించాలని గతంలోనే అనుకుంది ప్రభుత్వం. 
 
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.
 
గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సరైన రవాణా వ్యవస్థ లేక ప్రాణాలు కోల్పోతున్నారని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ఈ అంబులెన్స్ లను కొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments