Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో 81763 టెస్టులు చేస్తే 2567 కొత్త కేసులు

Advertiesment
Today
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 81,763 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ కేసులు వెల్లడయ్యాయి. 
 
ఈ కేసులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 356 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 351 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, పశ్చిమ గోదావరి జిల్లాలో 279 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 3,034 మంది కోలుకోగా, 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,26,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా  18,87,236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 26,710 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,042కి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం వుందా? ఏం చేయాలి?