Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు - కానిస్టేబుల్ సస్పెండ్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (13:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌పై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినందుకు నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నవీన్ కుమార్ శెట్టిన అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిసాలి సస్పెండ్ చేశారు. 
 
అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో అమ్మోనియం విషవాయువుల ప్రభావంతో అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన పోస్టు చివరలో "అన్న వచ్చాడు. అస్వస్థతకు తెచ్చాడు" అంటూ క్యాప్షన్ పెట్టి పోలీస్ వ్యాట్సాప్‌లో గ్రూపు షేర్ చేసినట్టు నవీన్ కుమార్‌పై ప్రాథమిక ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారితో అనకాపల్లి ఎస్పీ గౌతమిసాలి ఆదేశించారు. అయితే, ఏపీ ప్రభుత్వంపై కానీ సీఎ జగన్‌పై కానీ కించపరిచేవిధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని అదుపులోకీ తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments